ఈరోజు ఉదయం నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మరియు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో భేటీ అయిన సంఘటన పెద్ద రచ్చ లేపుతున్న విషయం తెలిసిందే.
అసలు ఎన్నికల కమిషనర్ కి శ్రీనివాస రావు తో మరియు సుజనా చౌదరితో ఏం చర్చలు ఉంటాయి అన్నది అందరి ప్రశ్న. దీనిపై ఎవరి వారు తమ లాజిక్ ను వివరించారు. ఇకపోతే వీరు ముగ్గురూ విడివిడిగా హోటల్ లోనికి వెళ్లి ఒకే రూం లో గంటన్నర సేపు ఏమి మాట్లాడుకున్నారని అందరిలో ఆసక్తి నెలకొంది
అయితే ఇప్పుడు సుజనా చౌదరి.. ఆ మీటింగ్ పై వస్తున్న అనేక ఆరోపణలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ ఏమి క్రిమినల్ కాదని…. అంతేకాకుండా తాము కలవకూడదని చట్టం కూడా ఏమీ లేదని ఆయన అన్నారు.
“మేము చాలా దగ్గరి స్నేహితులం.. మాకు ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినట్లు, ఇష్టం వచ్చిన చోట కలుసుకుంటాము” అని సుజనా స్పష్టం చేశారు ఇక దీనిపై ఎవరికీ వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు అని చెబుతున్నారు.