టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2020 ప్రారంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు‘ సినిమాతో బాక్సాఫీస్ భారీ కమర్షియల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ బాబు చేయబోతున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట‘. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా మహేష్ బాబు 27వ సినిమాగా ‘సర్కారు వారి పాట‘ ని ప్రకటించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. టైటిల్ తోనే ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ క్రియోటవడం ఆసక్తికరం.
అయితే ఇప్పుడు అందరూ పరశురామ్ – మహేష్ బాబుల కాంబినేషన్ ఎలా ఉండబోతుంది.. అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. అయితే సర్కారు వారి పాట తెలుగు వరకే నా అన్న చర్చలు జరుగుతున్నాయట. అంటే ఇది పాన్ ఇండియన్ సినిమానా కాదా అన్నదే ఆ చర్చలకి కారణం.
మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోను అధికంగా ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరో మహేష్ బాబు కావడం విశేషం. అందుకే సర్కారు వారి పాట సినిమాను పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కిస్తారా..? లేక తెలుగు వరకే పరిమితం చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అనే సందేహం అందరిలో నెలకొంది.
అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆర్థిక నేరాల బ్యాక్డ్రాప్తో బ్యాంకు చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తే మాత్రం మహేష్ సతీమణి నమ్రత ఇన్వాల్మెంట్ ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ‘సర్కారు వారి పాట‘ పాన్ ఇండియన్ సినిమా అన్న ఒక్క మాట క్లారిటీ వస్తే మాత్రం మహేష్ ఫ్యాన్స్ నేల మీద నిలబడరు.