బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ మరణానికి కారణం రియా చక్రవర్తి అంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు ఆమెపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం అందరికీ తెలిసిందే. మొదటిలో అవకాశాలు రాక సుశాంత్ చనిపోయినట్లు అందరూ భావించారు. కానీ ఎప్పుడైతే రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చిందో డ్రగ్స్ కోణంతో పాటు అనేక విషయాలు బయటపడటంతో రియా చక్రవర్తి ఆమె సోదరుడు అరెస్టయి జైల్లో ఉండి ఇటీవల బెయిల్ పొందడం బయటకు రావడం జరిగింది.
అధిక మోతాదులో సుశాంత్ సింగ్ కి కావాలనే రియా చక్రవర్తి వైద్యుల సలహా మేరకు కాకుండా మెడిసిన్ ఇచ్చినట్లు సుశాంత్ సోదరీమణులు పోలీసులకు వాంగ్మూలం ఇవ్వటంతో.. అప్పటినుండి చక్రవర్తి అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరికి కటకటాలపాలయింది. ఆ తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొని బెయిల్ పొందిన రియా చక్రవర్తి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే తాజాగా రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరీమణులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ ఎఫ్ ఐ ఆర్ వాంగ్మూలంలో సుశాంత్ సోదరీమణులు ప్రియాంక .. మితు ఒక డాక్టర్ తరుణ్ కుమార్ తో కుమ్మక్కయ్యారు. హత్య.. మోసం.. ఫోర్జరీ.. మెడికల్ ప్రిస్క్రిప్షన్ .. క్రిమినల్ కుట్ర వంటి కల్పిత ఆరోపణలతో తనపై కేసులు వేసి వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా చూశాను సోదరీమణులు ఎవరికీ తెలియని ఒక డాక్టర్ ద్వారా మెడిసిన్ అందించారని రియా చక్రవర్తి తన ఫిర్యాదులో పేర్కొంది. మొత్తానికి చూస్తే సుశాంత్ మరణానికి కారణం ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే అని వాంగ్మూలంలో తెలిపింది.