Suspicious death: ఢిల్లీలో ఇద్దరి ప్రేమికుల అనుమానాస్పద మృతి Suspicious death రాష్ట్రంలో కలకలం రేపింది. అక్కడి ప్రజలకు ఓ ఇంటి నుంచి కుళ్ళిన వాసన వస్తుండటంతో వారు పోలీసులకు సమాచారం అందించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పవన్ పలివల్(29) అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని మీరట్కు నివసిస్తున్నాడు. అతడు గత కొద్దీ కాలంగా ఢిల్లీలో జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. పవన్ పలివల్ కు నైనితాల్కు చెందిన ప్రియాంక బిశ్త్(23) అనే యువతి గత కొద్దీ కాలంగా పరిచయం ఉంది. ప్రియాంక గూర్గావ్లోని ఉద్యోగం చేస్తుంది. ఈ ఇద్దరూ అతి తక్కువ సమయంలోనే మంచి స్నేహితులయ్యారు ఆ తరువాత వీరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ సడన్ గా ఏం జరిగిందో తెలియదు గానీ వారు ఇద్దరూ చనిపోయారు.
ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తూ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఇంటి లోపల లాక్ చేసి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆ డోర్ ని బద్ధలు కొట్టి మరీ పోలీసులు లోపలికి వెళ్లారు. అక్కడ వారు పవన్ మారియు ప్రియాంక మరణించి ఉండడాన్ని చూసారు. వెంటనే పోలీసులు ఇరువురి కుటుం సభ్యులకు సమాచారం అందించి ఆ మృతదేహాలిని పోస్ట్ మార్టం నిమ్మితం హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాలు స్థితిని చుసిన పోలీసులు వారు రెండుమూడు రోజుల క్రితమే చనిపోయి ఉండొచ్చని నిర్దారించుకున్నారు.
డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ… ఎప్పటిలాగానే కలుసుకోవడానికి పవన్ రాగా ఇద్దరూ కలిసి అక్కడ మద్యం సేవించి ఉండవచ్చని రూమ్ లో ఖాళీ మద్యం బాటిల్ తమకు లభించిందని తెలిపారు. బాటిల్ తో పాటుగా పోలీసులకు కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఘటనా స్థలంలో లభించాయి. కానీ పోలీసులకు అక్కడ ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదట. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.