ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలతో టిడిపి ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా ఆయన భార్య భారతిని కూడా వారు టార్గెట్ చేశారు.భారతి ఇసుక అంటూ టిడిపి సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టింది.దీనిపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి
చంద్రబాబు నాయుడు తన 14 ఏళ్ల సీఎంగా చేయనది ..వైఎస్ జగన్ ఏడాదిలోనే చేసి చూపించారని సామాన్యులు చెబుతున్నారు.ఇది ఎల్లో గ్యాంగ్కు అంతుపట్టకుండా పోయింది. ఎల్లో న్యూస్ పేపర్స్, ఎల్లో ఛానళ్లు, ఎల్లో యూ ట్యూబ్, వెబ్ సైట్లు ఏక కాలంలో దాడి చేస్తున్నా వైఎస్ జగన్ మాత్రం చిరు నవ్వుతో తన పనులు తాను చేసుకుపోతున్నారు. ఇక లాభం లేదని టిడిపి బ్యాచ్ జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డిని టార్గెట్ చేసింది. భారతీ ఇసుక అంటూ టీడీపీ నేతలు ట్రోల్స్ మొదలెట్టారు.ఈ ధోరణిని చూసి ప్రజలు కూడా విస్తుపోతున్నారు. వైఎస్ జగన్ ఏడాది పాలనతోనే టీడీపీ దుకాణం మూసుకోవడానికి సిద్ధమైంది. ఇది భరించలేకనే టీడీపీ నేతలు అనైతిక కామెంట్లకు తెగ బడుతున్నారు. ఈ రోజున వైఎస్ భారతీ రెడ్డి మీద టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్లు ఆ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ..ఆ విమర్శలు , ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడి, కట్టుబడి ఉండాలి. విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య విధానాలపై నమ్మకాన్ని కలిగించే విధంగా ఉండాలి. కానీ..దురదృష్టం. ప్రజాస్వామ్య సూత్రాలు కూడా తల దించుకునే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు .
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!