హైదరాబాద్: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. జస్టిస్ ఫర్ దిశ వ్యవహారంలో విచారణ వేగవంతం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు అవుతోంది.
దిశ హత్యకేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం తరపున లా సెక్రటరీ సంతోష్ రెడ్డి హైకోర్టుక లేఖ రాశారు.