టీడీపీ, జనసేన, బీజేపీలు చేతులు కలిపాయి. సీట్లు పంచుకున్నాయి. ఇది ప్రస్తుతానికి టైటిల్ మాత్రమే. అసలు సినిమా మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానుంది. గుంటూరు వేదికగా బొప్పూడిలో నిర్వహిస్తున్న ఉమ్మడి తొలి భారీ బహిరంగ సభ నుంచి మూడుపార్టీలూ ఉమ్మడి కార్యాచరణను ప్రకటిం చనున్నాయి. ఇక, అప్పటి నుంచి మూడు పార్టీలూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని కూడా దంచి కొట్టనున్నాయి.
ఇది ఓకే. అయితే… ఈ మూడు పార్టీల ప్రభావం వైసీపీపై ఎంత పడుతుంది? బలమైన సంక్షేమ కార్యక్ర మాలతో దూసుకుపోతున్న వైసీపీ ప్రభుత్వాన్ని కట్టడిచేసి.. ఎన్నికల రణరంగంలో ఈ మూడు పార్టీలు.. చీల్చే ఓట్లు ఎన్ని? అనేది ఆసక్తిగా మారింది. కూటమి ప్రభావంపై సర్వత్రా జరుగుతున్న చర్చను బట్టి.. కీలకమైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు మాత్రం వైసీపీతోనే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది.
ఎందుకంటే.. కూటమిలో బీజేపీ ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. బీజేపీలేకుండా.. టీడీపీ-జనసేన మాత్రమే ముందుకుసాగి ఉంటే.. ఆ ప్రభావం వేరేగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతు న్నారు. పైగా బీజేపీపై 2014 ఎన్నికల సమయంలో ఉన్న సానుకూలత ఇప్పుడు ప్రజల్లో లేదు. అప్పటికి బీజేపీ క్లీన్ చిట్ తో ఉంది. అంటే.. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ప్రత్యేక హోదాను 5 ఏళ్లు కాదు.. 10 ఏళ్లు కావాలని.. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని అప్పట్లో బీజేపీ రాజ్యసభ వేదికగా ప్రశ్నించింది.
ఇక, మోడీ ప్రచార సభల్లో కూడా.. ఏపీకి న్యాయం చేస్తామన్నారు. ఇది 2014 ఎన్నికల పొత్తులను ముందు కు తీసుకువెళ్లడానికి దోహదపడింది. ఇప్పుడు అలాంటి సానుకూలత బీజేపీ విషయంలో లేదు. పైగా.. పదేళ్లుగా మోడీ రాజధాని, పోలవరం, స్టీల్ ఫ్యాక్టరీ వంటి కీలకమైన వ్యవహారాలను పక్కన పెట్టారు. దీంతో వ్యతిరేకత పెరిగిందే తప్ప.. సానుకూలత కాదు. ఇలాంటి పరిస్థితిలో పొత్తుల ప్రభావం వైసీపీపై పెద్దగా చూపించే అవకాశం లేదు.
అయితే..చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల దూకుడు మాత్రం పనిచేయొచ్చు. వారి ప్రచారం, వారి సానుకూ లత వంటివి మాత్రమే ఎన్నికల సమయంలో కీలకంగా మారితే.. అది పొత్తు పార్టీలు అంతో ఇంతో మేలు చేసే అవకాశం ఉంది. ఇది కాక.. వైసీపీకి భారీ నష్టం చేకూర్చే పరిస్థితి అయితే.. ఇప్పటికిప్పుడు కనిపించడం లేదు.