BRS – BSP: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ – బీఎస్పీ మధ్య సీట్ల సర్దుబాటు పై స్పష్టత వచ్చింది. పొత్తులో భాగంగా రెండు స్థానాలు బీఎస్పీకి కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నిర్ణయించారు. ఇరు పార్టీల మధ్య చర్చల అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్, నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాలను బీఎస్పీకి కేటాయించింది బీఆర్ఎస్. నాగర్ కర్నూల్ స్థానం నుండి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఇక రెండో స్థానం హైదరాబాద్ నుండి పోటీ చేయనున్న అభ్యర్ధిని బీఎస్పీ ఎంపిక చేసి ప్రకటించనుంది.
రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. బీఎస్పీకి రెండు స్థానాలు కేటాయించడంతో మిగిలిన 15 చోట్ల బీఆర్ఎస్ పోటీ చేయనుంది. బీఎస్పీ ఏ రాజకీయ పార్టీతో లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం లేదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని అధినేత్రిని ఒప్పించి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నట్లుగా తెలుస్తొంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ ..లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఈ పార్టీల పొత్తుపై ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు జరిపారు. చర్చలు ఫలప్రదం కావడంతో ఇరు పార్టీల నేతలు పొత్తుతో ముందుకు వెళుతున్నట్లు ప్రకటించారు. తాజాగా సీట్ల సర్దుబాటుపై ఇవేళ చర్చలు జరిపి ఫైనల్ చేసి ప్రకటించారు.
Breaking: రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల..మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనున్న ఈసీ