టీడీపీ ప్రకటించిన తాజా జాబితాపై చర్చ ఓ రేంజ్లో సాగుతోంది. 94 అసెంబ్లీ స్తానాలకు .. ప్రకటించిన జాబితాలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు కూడా అవకాశం ఇచ్చారు. వీరిలోనూ కొత్తవారు కూడా ఉన్నారు. అయితే, ఆశించినంత ఇచ్చారా? లేక.. ప్రస్తుత పరిస్థితులకు తగిన విధంగా సీట్లు కేటాయించారా? అంటే.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే కేటాయించారు. ఈ నేప థ్యంలో పెద్దగా ఎలాంటి వివాదాలు లేకుండా పోయాయి.
సహజంగా ఒక పార్టీ జాబితా ప్రకటించినప్పుడు ఇబ్బందులు తెరమీదికి వస్తాయి. అది ఏ పార్టీకైనా సహ జం టికెట్ ఆశించిన వారు.. గెలుపు గుర్రాలు తామేనని నమ్మిన వారు ఉంటారు. వీరితోపాటు.. ప్రజలలోనే ఉంటున్నవారు కూడా.. టికెట్పై ఆశలు పెట్టుకోవడం సహజం. అయితే.. అందరికీ ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి లేకపోవడం.. సమీకరణలు. బలమైన ఎన్నికల పోరు వంటివి ప్రధానంగా ఇప్పుడు తెరమీదికి వచ్చాయి.
వీరిపై నియోజకవర్గాల స్థాయిలో చర్చ జోరుగా సాగుతో.. చంద్రబాబు ఇచ్చిన జాబితాపై ఇటుసొంత పార్టీ లోనూ ప్రత్యర్థి పార్టీలనూ చర్చ సాగుతోంది. వీరిలో గెలుపు గుర్రాలు ఎంత మంది అనేది కీలక ప్రశ్న. ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం.. 50 నుంచి 60 మందికి అనుకూలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కొంత ఆశ్చర్యకరమే అయినా.. విస్మయం కలిగించినా.. ప్రత్యర్థి పక్షాన్ని పరిశీలించినప్పుడు.. ఈ సంఖ్యకు మించే అవకాశం ఉంటే మంచిదే.
కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో శ్రమిస్తున్న వారికి నేరుగా టికెట్లు దక్కాయి. మరికొన్ని చోట్ల మాత్రం పార్టీ జెండా పట్టుకోని వారికి కూడా.. టికెట్లు ఇచ్చారు. ఇవి.. కొంత అసంతృప్తికి.. ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. ఇలా చూసుకుంటే.. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ.. చాలా వరకు నియోజకవర్గాల్లో నాయకులపై ఉన్న విశ్వసనీయత, గెలుపు గుర్రం అనే ట్యాగ్ను నిశితంగా పరిశీలించినట్టు తెలుస్తోంది.