ఇక మనుషులకు కాలం చెల్లే టైం దగ్గర పడిందని శాస్త్రవేత్తలు స్పష్టంగా తెలుపుతున్నారు. ఇప్పటి వరకు భూమి అంతరించిపోతుందనే వార్తలు చాలానే విన్నాం. దానితో జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇక మేము బతుకుతామనే హోప్స్ ను కూడా వదిలేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఇలా శాస్త్రవేత్తల మూలంగా జనాలకు ప్రాణాలమీద ఆశే పూర్తిగా పోయింది. కాగా దానికి తోడు భూ గ్రహం అంతంపై సినిమాలు తీయడంతో ఇక నిజంగానే ఈ భూమి ఈ సంవత్సరానికి నాశనం అయిపోతుందేమోనని చాలా మందికి గుండెపోటు వచ్చింది.
కాగా ఇలా శాస్త్రవేత్తలు భూగ్రహం అంతరించిపోతుందని చాలా ఏండ్లు చెప్పినా వారి చెప్పిన తేదీ దాటిపోతూ వస్తూవుంది. 2012 నుంచి యుగాంతం అన్న చర్చ జరుగుతూనే ఉంది. కాని శాస్త్రవేత్తలు చెప్పిన యుగాంతం మాత్రం రాలేదు. అప్పటి నుంచి ప్రజలు కూడా యుగాంతాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. కాని ఈ సారి శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు ఉట్టివి ఏమాత్రం కాదని అంటున్నారు. ఈ సారి వారు చెప్పిన తేదీ నాడు ఖచ్చితంగా రాబోతోందని శాస్త్రవేత్తలు వెళ్లడించారు. ఈ యుగాంతం ఏ సంవత్సరంలో రాబోతోందా తెలుసా? అదే 2068 సంవత్సరమని స్పష్టం చేశారు. దానికి ఒక కారణం లేకపోలేదు సుమా.. ఈజిప్టు దేవుడు ఖోస్ పేరుమీద ‘అపోఫిస్ 99942’ అనే గ్రహశకలం భూ గ్రహాన్ని ఢీకొట్ట బోతుందట. దానితో భూఅంతం జరగబోతోందని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఈ అపోఫిస్ 99942 అని నామకరణం చేసిన గ్రహశకలం భూగ్రహం వైపు వేగంగా దూసుకువస్తున్నట్టు తెలిపారు. కాగా ఇది భూమికి అత్యంత చేరువలో వస్తున్న రెండో గ్రహశకలంగా పేర్కొన్నారు. 2068 సంత్సరానికి ఈ గ్రహశకలం భూ గ్రహాన్ని నిజంగానే ఢీకొట్టబోతోందని తెలిపారు. కాగా ఈ అపోఫిస్ 99942 అనే గ్రహశకలం భూ గ్రహానికి అత్యంత దగ్గరగా వచ్చిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. అలాగే 2012 లో వస్తుందన్న యుగాంతం ఉట్టి పుకార్లు కావని దానికి ఆధారాలున్నాయని ఖగోల పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ అపోఫిస్ 99942 గ్రహశకలాన్ని మాత్రం 2004 లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు.
దీనిని డేవిడ్ జే తోలెన్, ఆయన బృందం కనుగొన్నారు. కాగా ఈ గ్రహశకలం మాత్రం 2029 నాటికి భూమికి అత్యంతచేరువలోకి వస్తుందనేది సువారు టెలిస్కోప్ సహాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ గ్రహశకలంపై యార్కోవ్ స్కీ త్వరణం ప్రభావం కూడా ఉందని తాజా పరిశోధనలో వెళ్లడైంది. కాగా 2029 సంవత్సరంలో ఈ గ్రహశకలం భూమిని కచ్చితంగా ఢీకొట్టకపోవచ్చని అంచనా వేశారు. కాని 2017 డేటా ప్రకారం 2068 సంవత్సరంలో మాత్రం ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.