మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ అలవైకుంఠపురములో తర్వాత నెక్స్ట్ సినిమాని ఎన్.టి.ఆర్ తో చేయనున్నారన్న వార్త గత కొంతకాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్.టి.ఆర్ 30 గా తెరకెక్కాల్సిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించిననున్నారన్న వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా కోసం పాన్ ఇండియన్ రేంజ్ స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ తయారు చేసినట్టు సమాచారం. అయితే ఎన్.టి.ఆర్ ఇప్పుడు చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా చాలా కారణాల వల్ల చాలా నెలలు డిలే అయింది. దాంతో ఈ మధ్య త్రివిక్రమ్.. ఎన్.టి.ఆర్ కంటే ముందు మహేష్ బాబు తో సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు.
అలాగే యంగ్ హీరో రాం తో కూడా చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా మహేష్ చేయబోతున్న సర్కారువారి పాట కూడా డిలే అయింది. డిసెంబర్ లేదా జనవరి నుంచి సర్కారు వారి పాట మొదలవనుందని సమాచారం. సర్కారు వారి పాట మొదలు పెట్టి నాన్ స్టాప్ గా సినిమాని పూర్తి చేయాలని మహేష్ నిర్ణయించుకున్నాడట.
కాబట్టి అందరూ అనుకుంటున్నట్టు త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో అనుకున్న ప్రాజెక్ట్ మొదలవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అర్థమవుతోంది. దీన్ని బట్టి చూస్తే త్రివిక్రమ్ – ఎన్.టి.ఆర్ సినిమానే ముందు పట్టాలెక్కనుంది. లేదంటే త్రివిక్రమ్ – రాం తో సినిమా మొదలు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటాడని అంటున్నారు. చూడాలి మరి ఏ విషయం అఫీషియల్ న్యూస్ వస్తేనే నమ్మగలం.