Trending viral: ప్రస్తుతం సమాజంలో మానవత్వం అనేది తగ్గిపోయింది. పూర్వం ఇంటికి ఎవరైనా అతిథి వచ్చి భోజనం చేయనిదే ఇంట్లోని వారు ముద్ద ముట్టే వారు కాదని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. పరోపకారం మాట అటుంచితే ప్రాణాలు పోతున్నా తోటి మనిషిని అలాగే వదిలేసి వెళ్లిపోతున్నారు. కొందరు సోషల్ మీడియా మాయలో పడి, ఓ వ్యక్తి నడిరోడ్డుపై ప్రాణాపాయంతో ఉంటే మిగిలిన వారు దానిని వీడియో తీస్తూ వినోదం పొందుతున్నారు.
అవతలి వ్యక్తి ప్రాణాలను కాపాడడానికి ముందుకు రాకుండా సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్ల కోసం తహతహలాడిపోతున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ప్రమాదంలో ఉన్న ఆవును కాపాడేందుకు ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Trending viral : ఆవుకు ప్రాణాలను రక్షించాలని..
పంజాబ్ రాష్ట్రంలోని మాన్సా పట్టణం జిల్లా కేంద్రం. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడ పట్టణంలో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ఈ తరుణంలో ఓ ఆవు అక్కడి విద్యుత్ స్తంభాన్ని పొరపాటున తాకింది. దీంతో విద్యుత్ షాక్ కొట్టి విలవిలలాడిపోయింది. చివరికి అక్కడి నీటిలోనే స్పృహ తప్పి పడిపోయింది.
వీడియో వైరల్..
ఈ ఘటనను సమీపంలోని ఓ వ్యాపారి చూశాడు. వెంటనే తేరుకుని అక్కడకు వెళ్లాడు. ఆవు విద్యుత్ స్తంభానికి దగ్గరలోనే ఉండడంతో మరోసారి షాక్ కొట్టే ప్రమాదం ఉందని గ్రహించాడు. వెంటనే ఓ గుడ్డను దాని కాళ్లకు కట్టి వెనక్కి లాగాడు. అతడికి మరో ఇద్దరు కూడా సహకరించారు. కాసేపటికి తేరుకున్న ఆ ఆవు ప్రాణాలు దక్కించుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పెట్టడంతో విషయం వైరల్ అయింది. ఆవు కోసం ప్రాణాలను రిస్క్లో పెట్టి కాపాడావంటూ పలువురు నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు.