కోర్టు దిక్కరణ కేసులో గతంలో విద్యాశాఖలో ఉన్నతాధికారులు (ఐఏఎస్ )గా పని చేసిన ఇద్దరికి నెల రోజుల పాటు జైలు శిక్ష, రెండు వేల జరిమానా విధించిన ఏపి హైకోర్టు.. ఆ ఇద్దరు అధికారులు హైకోర్టుకు వచ్చి క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో జైలు శిక్షను సడలించింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయని నేపథ్యంలో నాడు ఏపి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణలుగా పని చేసిన వీరికి హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా శిక్షగా విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే వీరు కోర్టుకు వచ్చి క్షమాపణలు చెప్పడంతో జైలు శిక్షను రద్దు చేసింది. అందుకు అనుగుణంగా సాయంత్రం వరకూ కోర్టులో నిలబడాలని ఆదేశాలు జారీ చేసింది.
రాజశేఖర్ సెలవుపై ఉండగా, రామకృష్ణ ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఐజీగా పని చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా పలువురు ఐఏఎస్ అధికారులు కోర్టు దిక్కరణ కేసులో ఇటువంటి శిక్షలనే ఎదుర్కొన్నారు. ఈ పరిణామం అధికారుల వర్గాలను ఆందోళనకు గురి చేస్తొంది.
.