అమరావతి: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వాసిరెడ్డి పద్మతో మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శాసససభాపతి తమ్మినేని సీతారాం, డిప్యూటి సిఎంలు పుష్పశ్రీవాణి, నారాయణస్వామి, మంత్రులు ధర్మాన కృష్ణదాసు, జయరాములు, చెరుకువాడ శ్రీరంగనాధ్ రాజు, ఏపిఐసిసి చైర్పర్సన్ ఆర్కె రోజా, ఎంపిలు వంగా గీత, చింత అనురాధ, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మీడియా సలహాదారుడు జివిడి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. మహిళా చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన పద్మను పెద్ద సంఖ్యలో విచ్చేసిన నేతలు, కార్యకర్తలు, అభినందనలు తెలియజేశారు.
previous post
next post