NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

విశాఖ ప్రమాదం చుట్టూ అనుమానాలెన్నో..!!

విశాఖ సాల్వెంట్స్ లో అగ్ని ప్రమాదం ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారింది. ఎల్జీ పాలిమర్స్ లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన, ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ, ఆ నివేదిక అన్నీ కొంత మేరకు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కూడా ఒక రకంగా మంచి పేరు వచ్చింది. కానీ ఈ విశాఖ సెలవెంట్స్ ప్రమాదంపై మాత్రం ప్రభుత్వం ఇరుకున పడేలా ఉంది. తాజాగా ఆ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందంటూ ఎన్నో అనుమానాలు ఉన్నాయంటూ సింటిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థ లేవనెత్తింది. వారి అనుమానాలు అన్ని పేర్కొని విశాఖ కలెక్టర్ కు ఓ పెద్ద లేఖ రాసింది.

 

 

వారు రేకెత్తించిన అనుమానాల ప్రకారం…* ట్యాంక్ లో వ్యాక్యూమ్, 600-650 మిల్లీ మీటర్ల మెర్క్యురీ నుంచి 350మి.మీ మెర్క్యురీకి తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. దీని అర్ధం పీడనం, ఉష్ణోగ్రత పెరిగినట్లు. ఉష్ణోగ్రత 75-95 డిగ్రీలకు పెరిగినట్లు ఇచ్చారు. ఆలా అయితే రసాయన మిశ్రమాల మరిగే ఉష్ణోగ్రత తగ్గిందని ఎలా చెప్పారు?. దీన్ని బట్టి కమిటీ అధికారుల్లో అవగాహన లేదని తెలుస్తోంది. * ఫ్లాష్ పాయింట్ మీద అధికారుల్లో కనీస అవగాహన లేదు. ఈ పాయింట్ దగ్గర చిన్న మంట గుప్పుమని వెలిగి వెంటనే ఆరిపోతుంది. ఈ ఫ్లాష్ పాయింట్ క్రమంగా తగ్గిందని నివేదికలో చెప్పినప్పుడు, మరి ప్రమాదం జరిగిందో అధికారులు ఆలోచించలేదు. * రసాయన మిశ్రమాల మరిగే ఉష్ణోగ్రత తగ్గటం వల్లే ఫ్లాష్ పాయింట్ కి చేరి ట్యాంకు తేపేలి ఉంటుందన పేలి ఉంటుందని చెప్పడం ఊహాజనితం. ఫ్లాష్ పాయింట్ దగ్గర ఆవిరి దానంతట అదే ఉండదు. అలా జరగాలంటే నిప్పు ఉండాలి. అది ఎక్కడ నుండి వచ్చిందో అధికారులు చెప్పాలి. * ప్రమాద సమయంలో పరిశ్రమ నిర్వాహకులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు రాశారు. ఆ సమయంలో అగ్నిమాపక అధికారులే దూరంగా ఉండి మంటలు ఆర్పారు. అలాంటప్పుడు పరిశ్రమ వారు లోపల ఎలా రెస్క్యూ ఆపరేషన్లు చేశారు?. ఇలా పలు అంశాలను లేవనెత్తుతూ..నివేదిక చూస్తుంటే పరిశ్రమ యాజమాన్యాన్ని కాపాడడానికి ఇచ్చినట్లుగా ఉన్నది. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదు. నివేదికలో వాడిన పదాలు కూడా అవగాహన లేనట్లుగా ఉన్నాయని సంస్థ లేఖలో పేర్కొన్నది.

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం విషయంలో సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ సంస్థలోని డైరెక్టర్, సీఈఓ సహా కీలక అధికారులందరిని అరెస్టు చేయించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా విశాఖ సాల్వెంట్స్ విషయంలో కూడా నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో గుర్తించి చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి అదే రకమైన పేరు నిలబడుతుంది. లేకుంటే విశాఖలో రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు సహజంగా మారుతూ వాటిపై ప్రభుత్వం కూడా తప్పటడుగులు వేస్తే ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడుతుంది.

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?