Ys Jagan Mohan Reddy : వైయస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan Mohan Reddy ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ దేశంలో చాలా మందిని ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు ప్రధాని మోడీ ఎటువంటి వ్యవస్థను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అందుబాటులోకి తీసుకు వస్తే బాగుంటుందని స్పష్టం చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల విజయవాడ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఒక్కసారిగా వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి జీతాలు పెంచాలంటూ భారీ ఎత్తున ఆందోళనలు నిరసనలు చేపట్టడంతో ఒక్కసారిగా జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
పరిస్థితులు ఇలా ఉండగా వాలంటీర్లు వ్యవహరించిన తీరు పట్ల సీఎం జగన్ లేఖ ద్వారా స్పందించి..వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా చేసే సేవా కార్యక్రమం అని ఈ క్రమంలో కొందరు ప్రలోభాల వల కుట్రలు వల్ల మీరు ఈ విధంగా వ్యవహరించటం సరైన విధానం కాదని, దయచేసి అటువంటి కుట్రలో పడవద్దు.. మీ పట్ల ప్రజలకు ఎంతగానో గౌరవం ఉంది దాన్ని కాపాడుకోండి అంటూ జగన్ రాసిన లెటర్ లపై తాజాగా వాలెంటర్ల్లు స్పందించారు. ఈ క్రమంలో కొంత మంది వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు. విజయవాడలో జరిగిన ఘటనకు సంబంధించి సీఎం జగన్ కి సారీ చెబుతున్నట్లు స్పష్టం చేశారు.
అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ గారు తాను రాసిన లెటర్ లో వాలంటీర్లకు స్పష్టమైన విధి విధానాలు గురించి చెప్పటం పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు స్పష్టం చేశారు. కేవలం వారానికి రెండు మూడు రోజులు మాత్రమే సేవ చేయండని చెప్పిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంటూ పేర్కొన్నారు. అదే రీతిలో ప్రజలకు సేవ చేయ్యలన్న దృక్పథంతో ఉన్న సీఎంని స్ఫూర్తిగా తీసుకుని సేవ చేస్తున్నాం. మేము ఎప్పటికి సీఎం జగన్కి వ్యతిరేకంగా కాదు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి.. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తాం’’ అని వలంటీర్లు స్పష్టం చేశారు