Nidhi agarwal : నిధి అగర్వాల్ కెరీర్ ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతోంది. బాలీవుడ్ లో చేసిన డెబ్యూ సినిమా మున్నా మైఖేల్ తర్వాత కంప్లీట్ గా టాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టింది. ఇక్కడ చేసిన రెండు సినిమాలు ఫ్లాపవగా లక్కీగా మూడవ సినిమా ఇస్మార్ట్ శంకర్ మాత్రం భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ లో వరుసగా రెండు సినిమాలు చేసింది. జయం రవి సరసన భూమి. ఈ సినిమా నిధికి మంచి హిట్ ఇచ్చింది. అలాగే శింభు తో ఈశ్వరన్ చేసింది. ఈ రెండు సినిమాలతో తమిళ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా మారింది. అక్కడ నిధికి మంచి ప్రాజెక్ట్స్ లో చేసే అవకాశాలు వస్తున్నాయట.
అయితే టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లులో ఆయన సరసన చేస్తోంది. ఇది నిధి కెరీర్ లో గొప్ప సినిమాగా నిలవడం ఖాయం. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో ఏ.ఎం.రత్నం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రాక్టీస్ చేశాడు. భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి అని ఫస్ట్ టీజర్ తోనే దర్శకుడు క్రిష్ హింట్ ఇచ్చాడు.
Nidhi agarwal : నిధి కెరీర్ ని హరిహరవీర మల్లు మలుపు తిప్పుతుందట.
అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. ఇప్పటివరకు ఈమె ఇలాంటి రోల్ చేయలేదు. ఆ రోల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పాత్రని మోసం చేసే పాత్రలో నిధి నటిస్తుందట. ఒకరకంగా ఇది నెగిటివ్ రోల్ అని చెప్పుకుంటున్నారు. ఈ పాత్రను క్రిష్ చాలా బాగా డిజైన్ చేశాడట. నిధి కెరీర్ ని హరిహర మల్లు మలుపు తిప్పుతుందని ఈ సినిమా తర్వాత ఆమెకి టాలీవుడ్ లో భారీ అవకాశాలు దక్కనున్నాయని అంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్.టి.ఆర్ సినిమాలలో నటించే అవకాశం కూడా దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.