WTC Final: ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కొన్ని సంవత్సరాలు ఇంటా బయట టెస్ట్ సిరీస్ లు ఆడిన టాప్ క్రికెట్ జట్ల మధ్య సమరం తుది దశకు చేరుకుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ కోసం భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఈనెల 18న ఇంగ్లాండ్ సౌతాంప్టన్ లో ఫైనల్ జరగనుంది. మరొక మూడు వారాల్లో ఫైనల్ అనగా న్యూజిలాండ్ జట్టు, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరిగింది.
ఈ టెస్ట్ సిరీస్ వరల్డ్ ఛాంపియన్షిప్ సైకిల్ లో లేదు. దీని వల్ల పాయింట్ల పట్టిక పై ఎటువంటి ప్రభావం పడదు. అయినప్పటికీ భారత్ కి మాత్రం ఇది విపరీతమైన నష్టం కలిగించే పరిణామమే. మామూలుగా భారత్, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు టెస్ట్ క్రికెట్ లో టాప్ స్థానాల్లో ఉంటాయి. న్యూజిలాండ్ బలమైన జట్టే అయినప్పటికీ వారి పైన ఎవరికీ అంతగా అంచనాలు లేవు. ఇంగ్లాండ్ మాత్రం దాదాపు ఫైనల్ కు అర్హత సాధిస్తుంది అన్న నమ్మకంతో న్యూజిలాండ్ జట్టుతో ఈ రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను షెడ్యూల్ లో ప్రాక్టీస్ గా ఉంచుకుంది.
అయితే ఇంగ్లాండ్ అనుకున్నంత గొప్పగా పెర్ఫార్మ్ చేయలేకపోవడం… న్యూజిలాండ్ అంచనాలకు మించి రాణించడంతో న్యూజిలాండ్ ఫైనల్ కి వెళ్ళి ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో కిందకు దిగిపోయింది. భారత్ టెస్టు చాంపియన్షిప్ రెండు వారాలు ఉందనగా ఇంగ్లాండ్ లోకి అడుగుపెట్టింది. అయితే అప్పటికే న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేశారు.
రెండు టెస్టు మ్యాచ్లను ఏకపక్షంగా గెలిచిన న్యూజిలాండ్ జట్టుకు కావలసినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. ఇక్కడి పరిస్థితుల పై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది. వారి ప్రధాన బౌలర్లు వికెట్ల వేట కొనసాగించారు. కాబట్టి ఇంగ్లాండ్ వారు తమ ఫైనల్ కు ప్రాక్టీస్ అవుతుందనుకున్న సిరీస్ న్యూజిలాండ్ కు ప్రాక్టీస్ లా మారింది. ఇది భారత్కు కొద్దిగా ప్రతికూల అంశమే. ఫైనల్ కి కూడా న్యూజిలాండ్ స్ట్రాంగ్ ఫేవరెట్ అయింది. అయితే తక్కువ అంచనాలతో బరిలోకి దిగితే కోహ్లీ సేన ఎక్కువ ప్రమాదకరమైన విషయం తెలిసిందే.