జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తన కుటుంబ సభ్యులంతా క్రిస్టియన్లు అని, తాను నిజమైన భారతీయుడు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ డైలాగ్ లు వేసి.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బిజెపి పార్టీ తో కలిసి ఇప్పుడు హిందూ మతం గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సెటైర్లు వేశారు.
ఎన్నికల ముందు సమాజంలో మత గొడవలు పెట్టేది హిందువులే అని కామెంట్లు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలలో ఓడిపోయి బిజెపి పార్టీ తో కలిసిన తర్వాత మరొక మాట ఈ విధంగా మాట్లాడే పవన్ గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజాగా మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలాఉంటే ఇటీవల విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించి చాలా వరకు బీజేపీ నేతలు మత తరహా కామెంట్లు చేస్తున్న తరుణంలో అదేరీతిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడంతో.. మంత్రి వెల్లంపల్లి ఈ రీతిగా కౌంటర్లు వేసినట్లు తెలుస్తోంది.