YCP MLC: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్ధి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా ఆరుగురికి కోర్టు 18 నెలలు జైలు శిక్షతో పాటు రెండున్నర లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఇవేళ తీర్పు వెల్లడించారు.
ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. అయిదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. తర్వాత బాధితుల్లో ఒకరు మృతి చెందగా, మిగిలిన నలుగురు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు.
28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. 148 సార్లు వాయిదా పడింది. ఈ కోసులో తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. వారికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. కాగా, న్యాయస్థానం తీర్పుపై దళిత, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్