Janasena: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) వ్యవస్థాపక అధ్యక్షుడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు..ఇరుపక్షాల వాదనలు విని ఇటీవల తీర్పును రిజర్వు చేసింది.
తాజాగా గ్లాస్ గుర్తును జనసేనకే కేటాయిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. దీంతో ఆ గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టును కొట్టివేయడంతో జనసేనకు ఊరట లభించినట్లు అయ్యింది. అదే సమయంల ఫ్రీ సింబల్ నుండి దానిని తొలగించాలని ఇప్పటికే న్యాయ నిపుణులతో జనసేన చర్చిస్తుంది.
Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన