ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు జగన్, చంద్రబాబు పరిపాలన గురించి మాట్లాడుకునే మాటలు ఇవే. చంద్రబాబు ది అంత పబ్లిసిటీ పరిపాలన పని చేసేది తక్కువ హడావిడి ఎక్కువ అని, కానీ వైయస్ జగన్ చెప్పేది తక్కువ చేసేది చాలా ఎక్కువ అని అంటున్నారు. చంద్రబాబు పరిపాలన అభివృద్ధి అంతా ఫ్లెక్సీలపై, టీవీ యాడ్స్ లో మరియు రోడ్డు పక్కన గోడలపై బొమ్మలలో అదేవిధంగా గ్రాఫిక్స్ రూపంలో మాత్రమే కనబడతాయని సెటైర్లు వేస్తున్నరు ఏపీ జనం. కాగా ఏడాదిలోనే ఇలాంటి సంక్షోభంలో ఈ విధమైన పరిపాలన అందించడం పట్ల వైయస్ జగన్ మామూలోడు కాదు సరైన సీఎం అని తెగ పొగుడుతున్నారు.
ముఖ్యంగా బెజవాడ రోడ్లపై 104,108 ఆంబులెన్స్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆంబులెన్స్ అన్ని రోడ్డు మీదకి రావటం చూసి సరైన వ్యక్తి సీఎం అయితే ఇలానే ఉంటుంది అంటూ జగన్ పరిపాలన గురించి బెజవాడ వాసులు రోడ్డు పై వందలాది అంబులెన్సులు రావటం చూసి తెగ పొగిడారు. ఇక రాష్ట్రం లో ప్రతి పేదవాడి ప్రాణానికి ఎటువంటి అపాయం రాకుండా 20 నిమిషాల్లోనే ఆంబులెన్స్ వచ్చేలా వ్యవస్థను క్రమంగా పెట్టి ఆంబులెన్స్ లో సరికొత్త అత్యాధునిక వైద్య సదుపాయాలను కలిగిస్తూ వైయస్ జగన్ ఈ అంబులెన్సులను తీసుకు రావడం జరిగిందట.
ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గ్రామాల ప్రాంతాలలో ఎలాంటి చోట అయినా వెళ్లే లాగా ఆంబులెన్స్ రూపకల్పన వైయస్ జగన్ దగ్గర నుండి ఎక్స్పర్ట్స్ తో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైయస్ జగన్ విడుదల చేసిన ఈ అంబులెన్స్ వీడియోస్ 70ఎంఎం రూపంలో ఉంది అంటూ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పబ్లిసిటీ చేసే చంద్రబాబుకి ఈ విజువల్స్ చూసి దిమ్మ తిరిగి పోతుంది అంటూ వైసీపీ మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.