నేర చరిత గల నేతల కేసులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా సుప్రీంకోర్టు రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించడంతో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఈ తరహా కేసుల విచారణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వారం రోజుల్లో తమకు పంపాలని అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించడం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.రాష్ట్రంలోని టాప్ లీడర్ లిద్దరూ సుప్రీం కోర్టు ఆదేశాలతో లోలోన ఆందోళన చెందుతున్నారని సమాచారం.పైకి మాత్రం బింకం ప్రదర్శిస్తున్నారంటున్నారు.
సుప్రీం కోర్టు చర్య కారణంగా ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇరకాటంలో పడినట్లేనంటూ తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ‘సుప్రీం దెబ్బకి వైఎస్ జగన్ అబ్బా అనాల్సిందే అంటూ టీడీపీ నేతలు మీడియాకెక్కి నినదిస్తున్న విషయం విదితమే.జగన్ మీద అనేక కేసులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే.అయితే అదే సమయంలో ముందు మీది చూసుకోండంటూ వైసిపి నేతలు టిడిపి వారికి కౌంటర్ వేస్తున్నారు.టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి
చంద్రబాబు మీదా చాలా కేసుల విచారణ పెండింగ్లో వుంది.
వాటిల్లో స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వేసిన కేసు కూడా వుంది. చాలా ఏళ్ళుగా చంద్రబాబు స్టేల మీద స్టేలు తెచ్చుకుంటున్నారు వివిధ కేసులకు సంబంధించి. ‘నా మీద ఎలాంటి కేసులూ లేవు..’ అని చంద్రబాబు చెప్పుకుంటున్నా, ఆయన మీదా చాలా కేసులు వున్నాయని, వ్యవస్థల్ని ఆయన మేనేజ్ చేస్తున్నారనీ వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.వారం రోజుల లోపే ఎవరి జాతకం ఏమిటన్నది బయట పడబోతోంది .నిజానికి ఎన్నికల వేళ పోటీ చేసే అభ్యర్థులంతా తమ మీద ఉన్న కేసుల వివరాల్ని అఫిడవిట్లో పేర్కొనాలి. అయితే కేసులున్నంత మాత్రాన ఎలక్షన్లలో పోటీ చేయకూడదని నియమం లేదు క్రిమినల్ కేసులో శిక్ష పడితేనే పోటీకి అనర్హులు.
దీనినిఅడ్డం పెట్టుకుని ఇంత కాలం రాజకీయ నాయకుల ఆటలు సాగాయి చేయకూడదని నియమం లేదు.మళ్లీ వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి కూడా ఈ కేసులలో విచారణ పూర్తి కావడం లేదు శిక్షలు పడ్డంలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులపై ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో సుప్రీం కోర్టు తీసుకున్న కఠిన వైఖరి నిజంగా స్వాగతించదగింది.మొత్తం మీద ఇటు జగన్ అటు చంద్రబాబులు కూడా ఇదే విషయమై హైరానా పడ్తున్నారు!