Breaking: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి మరో మారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 25వరకు అవినాష్ ను అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు రీసెంట్ గా ఉత్తర్వులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తీర్పును 25వ తేదీన వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. సునీత పిటిషన్ ను సుప్రీం కోర్టు స్వీకరించింది. సునీత పిటిషన్ ను రేపు స్వీకరిస్తామని సీజేఐ తెలిపినట్లు సమాచారం. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మరో పక్క అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. కోర్టు ఆదేశాలతో నిన్నటి నుండి సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి వెళుతున్నారు. వరుసగా రెండు రోజు గురువారం అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అదే విధంగా చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి లను నిన్నటి నుండి కస్టడీలోకి తీసుకున సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ వరకూ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను విచారించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇవేళ తెలంగాణ హైకోర్టులో భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Vijaya Sai: చంద్రబాబుకు విజయసాయి బర్త్డే గ్రీటింగ్స్ .. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ