రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మహిళా మంత్రులు, వైసీపీ మహిళా నేతలు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు. సీఎం జగన్ కు రాఖీలు కట్టిన వారిలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విఎంఆర్ డీఏ చైర్ పర్సన్ అక్రమాని విజయలక్ష్మి, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు, ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు ఉన్నారు.
మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం
అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సెప్టెంబర్ లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు. రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస లు సీఎం జగన్ కు రాఖీలు కట్టిన అనంతరం మౌట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించారు.
అక్క, చెల్లెమ్మలకు జగన్ శుభాకాంక్షలు
రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది అత్మీయతలు, అనురాగాల పండుగ అని అన్నారు. ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణ పరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ సందేశాన్ని ఇచ్చారు.
చంద్రబాబు – జగన్ మధ్య తేడా ఇది అంటూ మరో సారి విమర్శనాస్త్రాలు సంధించిన వైసీపీ ఎంపీ విజయసాయి