అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పదేపదే అన్యాయం చేస్తున్నా రాష్ట్రంలోని బిజెపి నాయకులు నోరు మెదపడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం రాజధాని నిధులపై వివక్ష చూపుతున్నారనీ, రైల్వే జోన్ను గాలికి వదిలేశారనీ రామకృష్ణ ఆరోపించారు. గతంలో చంద్రబాబు అడిగినా నిధులు ఇవ్వలేదు, ఇప్పుడు జగన్ అడిగే పరిస్థితి కూడా లేదని రామకృష్ణ అన్నారు. ఏపిలో మాట్లాడే వారు లేరని కేంద్రం ధీమాగా ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. ‘రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిద్రపోతున్నారా, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు నోరు పడిపోయిందా’ అని రామకృష్ణ ప్రశ్నించారు.
విభజన సమస్యలపై వారు ఎందుకు మాట్లాడటం లేదని రామకృష్ణ మండిపడ్డారు.