ఏపీ రాజకీయాలలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మేటర్ హైకోర్టు దాకా వెళ్లడంతో పాటు కేంద్ర హోం శాఖకు కూడా చేరింది. అదేరీతిలో ప్రధాని మోడీ కి చంద్రబాబు లేఖ రాశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చంద్రబాబు కి లెటర్ రాసి అసలు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇస్తారా అని కోరడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా హోం మంత్రి సుచరిత మీడియా సమావేశం పెట్టి ఇదంతా అబద్ధం అని, పొలిటికల్ గేమ్ అని ఏపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కొట్టిపారేశారు.
పరిస్థితి ఇలా ఉండగా టిడిపి సరికొత్త విషయాలు బయట పెట్టింది. టిడిపి నేత బుద్ధ వెంకన్న గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇజ్రాయేల్ టెక్నాలజీ తో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్లు ఆధారాలతో పాటు నిరూపించటం జరిగింది అని అప్పట్లో మీరే అన్నారు. అవి ఎక్కడ అని తిరిగి ప్రశ్నించారు. అప్పట్లో ఈ విషయం పై వైవీ సుబ్బారెడ్డి కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే, వై.వి.సుబ్బారెడ్డి వేసిన కేసు వెనక్కి ఎందుకు తీసుకున్నారు. దమ్ముంటే అప్పట్లో చేసిన ఆరోపణలు ఇప్పుడు నిరూపించండి. ఎందుకు నిరూపించలేక పోతున్నారు? కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? అంటూ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి హోంమంత్రి సుచరిత అసత్యాలు మాట్లాడుతున్నారు. ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. మొత్తంమీద చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో బుద్ధా వెంకన్న సరికొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చి వైసీపీని, జగన్ ని ఇరకాటంలో పెట్టే సరికొత్త టాపిక్ తెరపైకి తీసుకురావడం ఆసక్తి కరంగా మారింది. గతంలో వై.వి.సుబ్బారెడ్డి చంద్రబాబు ప్రభుత్వం పై ఫోన్ ట్యాపింగ్ విషయంలో వేసిన కేసుని సాక్ష్యంగా తీసుకుని బుద్ధా వెంకన్న వ్యవహరించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంచలనం అయ్యింది. మరోపక్క హైకోర్టులో ఈ విషయానికి సంబంధించి సీనియర్ న్యాయవాది శ్రవణ్ కుమార్ పిల్ వేయడంతో న్యాయస్థానం విచారణ చేపట్టడంతో… ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో చివరాఖరికి ఏం జరుగుతుందో అన్నది సస్పెన్స్ గా మారింది.