ఏపీ రాజధాని కి సంబంధించి ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. మొన్నటి వరకు ఏపీ రాష్ట్ర మాజీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి కి మద్దతు నిలవడం తెలిసిందే. కాగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు సోము వీర్రాజు రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని తెలియజేశారు. కానీ బీజేపీ సపోర్ట్ అమరావతికి అన్నట్టు కొత్త తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇదిలా ఉండగా…. ఢిల్లీలో కీలక నేత సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఇటీవల మూడు రాజధాను లకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం జరిగింది.
ఒక విధంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర రాజధాని విషయంలో బిజెపి పార్టీకి ఒక స్టాండ్ అంటూ ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తన కలల రాజధాని అమరావతి విషయంలో బీజేపీ నేతల వ్యాఖ్యలలో తనకి అనుకూలంగా ఉండే పాయింట్లు మాత్రమే చంద్రబాబు తీసుకుని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. చాలామంది సీనియర్ నేతలు బాబు రాజకీయాన్ని గమనిస్తూ పాపం బాబోరు అని అంటున్నారట.
బిజెపి పార్టీకి చెందిన కీలక నాయకులు ఏపీ రాజధాని విషయంలో రకరకాల అభిప్రాయాలు తెలియజేస్తున్నా వారిని నిలదీయలేని పరిస్థితి టీడీపీ లో ఏర్పడింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా బిజెపి ని కడిగిపారేసిన చంద్రబాబు..రాజధాని విషయంలో అనుకూలమైన పాయింట్లను తీసుకుని బిజెపితో సర్దుకుపోతూ వ్యవహరిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.