గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై బిజెపి క్రమశిక్షణ చర్య చేపట్టింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసు జారీ చేసింది. పార్టీ లైన్ కు భిన్నంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్న అధిష్టానం .. షోకాజ్ నోటీసుకు ప్రతి రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. రాజాసింగ్ చేసిన అనుచిత వ్యక్తులపై పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉంది. ఇటీవల హైదరాబాదులో మునావర్ ఫారుఖీ షో నిర్వహణ సందర్భంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజాసింగ్ కామెంట్స్ చేశారు. తన వ్యాఖ్యల పట్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తే నుపూర్ శర్మ పై మాదిరిగానే తనను సస్పెండ్ చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపద్యంలో రాజాసింగ్ కు పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించ కూడదో రోజుల సమాధానం చెప్పాలని కోరింది. మరో పక్క వివాదాస్పద వ్యాఖ్యలు వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారన్న అభియోగంపై ఈరోజు రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారంటూ ఎంఐఎం వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనలు నిర్వహించడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వినతితో రాజాసింగ్ అప్లోడ్ చేసిన వీడియోను యూట్యూబ్ తొలగించింది.
ఎంఐఎం నేతల ఆందోళన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు