తెలుగు రాజకీయాలలో అపార రాజకీయ చాణిక్యుడు చంద్రబాబు అని చాలామంది రాష్ట్ర రాజకీయ నేతలు నేషనల్ స్థాయిలో ఉన్న నాయకులు చెబుతూ ఉంటారు. చంద్రబాబు వేసే వ్యూహాలు ఎవరూ వెయ్య లేరని ఆ స్థాయిలో…. ఏ టైంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో ఏ విధమైన హామీ ఇవ్వాలి ఓటు ఎలా రాబట్టుకోవాలి అన్న దాని విషయంలో ప్రజలను చంద్రబాబు చదివినా అంతా రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు అని చెబుతుంటారు. కానీ అటువంటి చంద్రబాబుని.. ఆయన రాజకీయ అనుభవం వయసు కలిగిన జగన్ అల్లాడించడం మామూలు విషయం కాదని ప్రస్తుతం చాలామంది మేధావులు చెప్పుకొస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా చంద్రబాబును ఓడించి…. కొద్దిపాటి మెజార్టీతో ప్రతిపక్షంలో కూర్చోపెట్టడం జరిగింది. కాగా ఇప్పుడు చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్ సరికొత్త స్ట్రాటజీ తో ముందుకు వెళ్తున్నట్లు టాక్. పరిస్థితి ఇలా ఉండగా ఇప్పటికే కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల మరికొన్ని చేరికలు ఉంటాయని…. త్వరలో ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబుకి పోతుందని వైసీపీ నేతలు ముందునుండి అంటూనే ఉన్నారు.
ఇటువంటి తరుణంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసి తన కుమారుడితో పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణుల లో టెన్షన్ మొదలైనట్లు సమాచారం. చాలావరకు చంద్రబాబు విశాఖ ను రాజధానిగా గుర్తించకుండా అమరావతి నే ఏకైక రాజధానిగా ఉంచాలని…వ్యవహరించిన క్రమంలో వాసుపల్లి గణేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. తాజా పరిణామంతో ఇది కచ్చితంగా చంద్రబాబు కి ఘోర పరాభవం అని…నిజంగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం లో జగన్ ఇచ్చిన స్ట్రోకులు చంద్రబాబుకి మారే రాజకీయ నాయకుడు ఇచ్చి ఉండరని అంటున్నారు. ఇది ఎలక్షన్ కంటే అతి పెద్ద విజయం జగన్…చంద్రబాబుకి ఏ హోదా లేకుండా అసెంబ్లీలో కూర్చోబెట్టడం…బాబు సీనియార్టీకి ఘోర పరాభవం అని మేధావులు చెప్పుకొస్తున్నారు.