అమరావతి: మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై భూ వివాదానికి సంబంధించి తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని వస్తున్న వార్తలపై ఆమె సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబంలో ఎటువంటి విబేధాలు లేవని జగత్ విఖ్యాతరెడ్డి స్పష్టం చేశారు.
ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో దుబాయ్లో ఉన్న జగత్ విఖ్యాతరెడ్డి స్పందిస్తూ ఓ వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు.
‘నమస్కారమండీ, పొద్దుటి నుండి మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. నేనేదో కేసులు వేశానని చెబుతున్నారు. నేను దుబాయ్లో ఉండటం వల్ల ఎవరికీ అందుబాటులోకి రాలేకపోతున్నా, అందుకే ఈ వీడియో ద్వారా అసలు విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నా, మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండి. అవన్నీ అసత్యాలే. మేమంతా కలిసే ఉన్నాం, భూమా కుటుంబాన్ని, భూమా కేడర్ని ఎలా బలపరచాలా అనే మేమంతా ఆలోచిస్తామే కానీ మచ్చ వచ్చే పనులేవీ మేము చేయం, మీడియాలో వచ్చే వార్తలను దయచేసి నమ్మకండి’ అంటూ విఖ్యాతరెడ్డి విజ్ఞప్తి చేశారు.