దాదాపు పది సంవత్సరాలు అనేక పోరాటాలు నిందలు అవమానాలు జైలు జీవితం… ఇంకా అనేక రీతులుగా రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొని ముఖ్యమంత్రి పీఠాన్ని 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో జగన్ కైవసం చేసుకోవడం తెలిసిందే. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 151 మంది ఎమ్మెల్యేలు మరియు 22 మంది ఎంపీల తో జగన్ అధికారంలోకి వచ్చి హిస్టరీ క్రియేట్ చేశారు. వచ్చిన ఫలితాలకి టిడిపికి ఇక భవిష్యత్తు లేదు అన్నా అభిప్రాయం ప్రతి ఒక్కరిలో నెలకొంది.
కాగా జరిగిన 2019 ఎన్నికలలో జగన్ తో పాటు వైసిపి కార్యకర్తలు కూడా డూ ఆర్ డై అనేరీతిలో, తీవ్రస్థాయిలో కష్ట పడటం జరిగింది. కాగా అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తన క్యాబినెట్ ఏర్పాటు విషయంలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ మంత్రి పదవులు కట్టబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా క్యాబినెట్ ఏర్పాటైన తర్వాత జరిగిన సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణ ఏ మంత్రి మీద రాకూడదని పేర్కొన్నారు. ఎవరిమీదైనా వస్తే తక్షణమే సస్పెండ్ చేయడం జరుగుతుందని, అదే రీతిలో మీకు ఇచ్చే పదవీ కాలం కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటుందని ఆ తర్వాత మార్చడం జరుగుతుందని దీనికి ప్రిపేర్ అయి ఉండాలని జగన్ తన మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు.
కాగా జగన్ ఇటీవల తన పరిపాలన 15 నెలలు దాటిన తరుణంలో అసలు మంత్రివర్గంలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనేదాన్ని విషయంపై జగన్ ఇంటిలిజెన్స్ ద్వారా నిఘా పెట్టగా…. ముగ్గురు మంత్రులు అవినీతికి భారీగా పాల్పడుతున్నట్లు తేలిందట. దీంతో వారి కదలికలపై స్పెషల్ టీం నీ… వారిని నీడలా వెంటాడేలా జగన్ నియమించినట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ ముగ్గురు మినిస్టర్ల పై ముందుగానే వేటు వేయడానికి, తగిన ఆధారాలు కోసం జగన్ వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.