మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేక ఫోకస్ తో
మరో పక్క పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలన్న ప్రతిపాదన ఆ పార్టీ నేతల్లో ఎప్పటి నుండో వ్యక్తం అవుతోంది. జూనియర్ అభిమానులు పార్టీ పట్ల అంటీ మున్నట్లుగా ఉంటున్నారని వార్తలు వినబడుతున్నాయి. కుప్పంలోనూ జూనియర్ ఫ్యాన్ సొంత రాజకీయాలు మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది. కుప్పంలో పార్టీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇంతకు ముందు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కుప్పంకు వెళ్లకుండానే రాజకీయాలు చేస్తూ గెలుస్తూ వచ్చిన చంద్రబాబుకుn ఇప్పుడు కుప్పంకు తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబుకు చిరకాల ప్రత్యర్ధి అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుప్పంపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో కుప్పంలో మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తీవ్ర పరాభవం ఎదురైంది.
Junior NTR : జూనియర్ కోసం ప్రయత్నాలు..?
ఈ పరిస్థితుల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడం కోసం చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుండి క్షేత్ర స్థాయి పరిస్థితులను తెప్పించుకుని మరీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని క్యాడర్ కు సూచిస్తున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా జనసేన మద్దతు తీసుకునే ప్రయత్నాలు చేస్తూనే మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారంలో ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని సమాచారం. గతంలోనూ టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ 2019 ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ ను రంగంలోకి దించేందుకు నందమూరి ఫ్యామిలీ ద్వారా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..?.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!