అమరావతి: తెలంగాణకు చెందిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టడంపై టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులు తెలంగాణ వారికి ఇవ్వడంలో మతలబేంటి అని వర్ల ప్రశ్నించారు. ‘ఏపిలో రిజర్వేషన్లు మారాయా? 75శాతం స్థానికులకు, 25శాతం తెలంగాణ వారికి నిజమా?’ అని వర్ల ప్రశ్నించారు.
‘ఆంధ్రులను దుర్భాషలాడిన సాక్షి ఛానల్ ఉగ్యోగి, తెలంగాణ వాసి అమర్కు క్యాబినెట్ హోదాతో పదవి, నల్లగొండ వాసి విజయకుమార్కు సమాచార కమిషనర్, కమ్యూనికేషన్ సలహదారుగా ఖమ్మం వాసి కృష్ణమోహన్, తాజాగా ఖమ్మం వాసి, సాక్షి ఎడిటర్గా పని చేసిన రామచంద్రమూర్తికి క్యాబినెట్ హోదాతో పదవి. ఏంటి సార్..తెలంగాణ వారికి మన పదవులు ? మతలబేంటి? అని వర్ల ప్రశ్నించారు.
తాజాగా ఖమ్మం వాసి సాక్షి ఎడిటర్ రామచంద్ర మూర్తికి క్యాబినెట్ హోదాతో పదవి. ఏంటి సార్… తెలంగాణ వారికి మన పదవులు? …మతలబేంటి?….
— Varla Ramaiah (@VarlaRamaiah) August 27, 2019