తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న విజయశాంతి పొలిటికల్ కెరియర్ పై ఇటీవల రకరకాల వార్తలు రావటం మనకందరికీ తెలిసిందే. విజయశాంతి త్వరలో బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు ఆ వార్తలు యొక్క సారాంశం. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డిని అదేవిధంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని విజయశాంతి కలిసినట్లు దుబ్బాక ఉప ఎన్నికలకు ముందే చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు ఉత్తమ్కుమార్రెడ్డి విజయశాంతి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
అదే సమయంలో సోషల్ మీడియాలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో నే కొనసాగుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతి పై చేసిన కామెంట్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పూర్తి విషయంలోకి వెళ్తే ఇటీవల మీడియా ముందు బండి సంజయ్ మాట్లాడుతూ విజయశాంతి ఎంతో ప్రజాదరణ ఉన్న నాయకురాలని… తెలంగాణ ఉద్యమంలో ఆమె కీలకంగా వ్యవహరించారని బండి సంజయ్ పొగడటం ఎప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో గ్రామాలలో అదే విధంగా ప్రజల్లో చైతన్యం కలిగించాలి అని కొనియాడారు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు విజయశాంతిని కొన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దీంతో బండి సంజయ్ చేసిన కామెంట్లు బట్టి చూస్తే త్వరలో విజయశాంతి బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోపక్క టీ-కాంగ్రెస్ నేతలు రాములమ్మ చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుందని అంటున్నారు. మరి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందా..? లేకపోతే బీజేపీలో చేరుతుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.