చలికాలం వచ్చిందంటే చాలు రకరకాల జబ్బులు దరిచేరుతుంటాయి. సీజనల్ వ్యాధులతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. పెద్దలు, చిన్నలు అనే తేడా లేకుండా ఈ సీజనల్ వ్యాధుల బారిన పడిపోతుంటారు. మరీ ముఖ్యంగా చలికాలం ఆస్థమా రోగులకు చాలా కఠినతరంగా మారిపోతూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంటడం వల్ల ఆస్తమా ఉన్న వారికి శ్వాస తీసుకోవడం చాలా కష్టతరమవుతుంటుంది. ఈ ఉబ్బసము మనిషిని చాలా సేపటి వరకు ఊరిపి తీసుకోకుండా చేస్తుంది.
ఇది పెద్దల్లోనే కాకుండా పిల్లల్లోనూ కనిపిస్తుంటుంది. కానీ ఇద్దర్లోనూ కారణాలు వేరువేరుగా కనిపించవచ్చును. ఈ వ్యాధి ముఖ్య లక్షణం మనిషికి ఆయాసం కలిగించడం. దీని మూలంగా శ్వాసకోసంలో శ్వాససంబంధమైన సమస్యలు ఏర్పడి శ్వాసకోశంలో వాపు వస్తుంటుంది. దీంతో శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఊపిరికి అడ్డుగా వస్తుంటుంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం చల్లటి గాలులు, రకరకాల సుగంధాలు, పెంపుడు జంతువుల విసర్జిత పదార్థాలు, దుమ్ము, దూళి, పొగ, ఎలర్జి, వైరల్ ఇన్ ఫెక్షన్ వంటివి ఉబ్బసాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.
ఈ ఉబ్బసంలో ప్రధానంగా పిల్లికూతలు, ఆయాసం, ఛాతిలో నొప్పి, దగ్గు వంటి తదితర లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస వ్యాకోచాన్ని తగ్గించే మందులను వాడటం మూలంగా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. కాకపోతే ఇది పాక్షికంగా ఉపశమనం కలిగిస్తుందే కాని తగ్గకపోవచ్చు. ఇది కొందరిలో ప్రాణాంతకంగా కూడా మారచ్చు. ఇది ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుందని సర్వేలు చెబుతున్నాయి.
ఈ వ్యాధిని కలిగున్న వారు ముఖ్యంగా పొగకు దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే దుమ్ముధూళికి దూరంగా ఉండాలి. చల్లటి పదార్థాలను తీసుకోకపోవడం చాలా మంచిది. పరిసర ప్రాంతాల్లో దుమ్ము లేకుండా నీట్ గా ఉంచుకోవాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం మరీ మంచిది. వెదర్ చల్లగా ఉన్నప్పుడు మాస్క్ వాడాలి. శరీర శ్రమను కూడా తగ్గించుకోవాలి. మందులతో కాకుండా డాక్టర్ల సలహాలు పాటించడం ద్వారా ఆస్తమాకు చెక్ పెట్టొచ్చు.