అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్పై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా వారిపై విమర్శలు గుప్పించారు.
పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం నుండి ప్రారంభిస్తే మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారని విజయసాయి విమర్శించారు. బియ్యం బస్తాలో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంట లోపలే పచ్చదొంగలు క్షుద్రదాడి మొదలు పెట్టారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
ఉద్దానం చుట్టూ అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తి ఇప్పుడు అక్కడేం జరుగుతుందో చూడలేక కళ్లు మూసుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఉక్కు సంకల్పంతో మెట్రోలలో తప్ప రాష్ట్రాల రాజధానుల్లో కూడా లేని సదుపాయాలతో 200 పడకల కిడ్నీ రీసెర్చి సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు @AndhraPradeshCM గారు.ఆ బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంట లోపలే క్షుద్ర దాడి మొదలు పెట్టారు పచ్చ దొంగలు. @naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 8, 2019
ఉద్దానం చుట్టూ అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తి ఇప్పుడు అక్కడేం జరుగుతుందో చూడలేక కళ్లు మూసుకున్నాడు. 200 పడకల కిడ్నీ రీసెర్చి సెంటర్ వస్తోంది. మెట్రోలలో తప్ప రాష్ట్రాల రాజధానుల్లో కూడా లేని సదుపాయం. ఉక్కు సంకల్పం నుంచి పుట్టుకొచ్చింది. ‘గాలి’ మాటల నుంచి కాదు. @AndhraPradeshCM
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 8, 2019