అమరావతి: రాష్ట్రంలో పచ్చచొక్కా మాఫియా విజృంభిస్తోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. గురువారం ట్విట్టర్ వేదికగా టిడిపి నేతలపై విమర్శలు చేశారు.
చంద్రబాబు మరో వారం రోజుల్లో మాజీ అయిపోతాడని అర్థం అవ్వడంతో పచ్చ చొక్కా ఇసుక మాఫీయా విజృంభిస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. పగలు, రాత్రి తేడా లేకుండా వాగులు, నదులను కొల్లగొడుతున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
గవర్నర్ జోక్యం చేసుకుని ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి మాఫియాను నియంత్రించాలని విజయసాయిరెడ్డి కోరారు.