(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: టీడీపి అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరో సారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి తిరోగమనంలో ఉందనీ, సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పెట్టుబడులకు ప్రమాదం ఉందంటూ ఎకనామిక్స్ టైమ్స్లో వచ్చిన కథనంపై విజయసాయి రెడ్డి స్పందించారు.
‘ఎకనమిక్ టైమ్స్ ఏదో రాసిందని కిరసనాయిలు తెగ మురిసిపోతున్నాడు. అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా. సంపాదించిన లక్షల కోట్లలో ఉల్లి పొరంత ఖర్చుపెడితే నిత్యం ఏదో కుట్రను ప్రచారంలో పెట్టొచ్చు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ సర్వైవల్ సీక్రెట్ ఇదే కదా!’అంటూ చంద్రబాబును ఉద్దేశించి విజయసాయి వ్యాఖ్యానించారు.
తన మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇళ్లపై ఐటీ దాడుల గురించి నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగలా ఉన్న చంద్రబాబు ఏబీవి సస్పెన్షన్పై మాత్రం కాస్త ధైర్యం తెచ్చుకుని మాట్లాడారని అన్నారు. అధికారులపై ఫ్యాక్షన్ వేధింపులకు పాల్పడుతున్నారని అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు వాళ్లకు ఏ పాపం తెలియదని మాత్రం అనలేకపోయారని విజయసాయి రెడ్డి విమర్శించారు.