అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపే చంద్రబాబు బండారం బయటపెట్టాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పోర్టల్లో పెట్టిన రహస్య జీవోలన్నింటిని గవర్నర్ జోక్యం చేసుకొని బయటపెట్టించాలని విజయసాయిరెడ్డి ఆదివారం ట్విట్టర్ వేదికగా కోరారు.
వందల జివోలను గోప్యంగా ఉంచాల్సిన అవసరమేముందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తన విమానం అద్దెలు, దొంగ చెల్లింపుల జీవోలన్నింటిని దాచి పెట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే లోగానే బండారం బయటపెట్టాలని విజయసాయిరెడ్డి కోరారు.