Ys Jagan: వైయస్ జగన్, భారతి తో భేటీ అయితే సస్పెన్స్ పోస్ట్ పెట్టినా హీరో విష్ణు..!!
Ys Jagan:ఇటీవల టాలీవుడ్ హీరో మంచు విష్ణు దంపతులు ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి ని కలవడం జరిగింది. శుక్రవారం తాడేపల్లి లో సీఎం జగన్ నివాసంలో మంచు విష్ణు దంపతులు కలసి భేటీ అయి కుటుంబ సమేతంగా భోజనం చేయడంతోపాటు అనేక విషయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ క్రమంలో విష్ణు దంపతులు జగన్ అదేవిధంగా భారతి తో దిగిన సెల్ఫీ ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది.
దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు విష్ణు భార్య విరోనిక.. వైయస్ ఫ్యామిలీకి చుట్టాలు అని అందరికీ తెలుసు. అప్పట్లో విష్ణు పెళ్లికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు జగన్ కూడా వెళ్లడం జరిగింది. చాలా సందర్భాలలో విష్ణు కూడా ఈ విషయాన్ని తెలిపారు. కాగా తాజాగా జగన్ తో విష్ణు బేటీ అవ్వటం సంచలనంగా మారింది. ఎందుకు కలిశారు అన్నది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కాగా ఫోటో షేర్ చేసి దాని కింద మంచు విష్ణు జగన్ కి విద్య పట్ల ఉన్న విజన్ గొప్పది అన్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు జనాలు ఆయన లో సైలెంట్ అదేవిధంగా మానవత్వం అనే కోణాన్ని మాత్రమే చూశారు హాస్య కోణాన్ని ప్రజలు ప్రజలు ఎవరూ చూడలేదు అంటూ క్యాప్షన్ పెట్టి మరిన్ని విషయాలు త్వరలో చెబుతానని విష్ణు పోస్ట్ పెట్టడం తో .. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా త్వరలో అనేక విషయాలు చెబుదాం అని మెలిక పెట్టడంతో రాజకీయరంగంలో అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఏంటి అన్నది సస్పెన్స్ నెలకొంది.