కరోనా మహమ్మారితో ముగిసిన ఈ ఏడాదిలో టెలికం రంగం బాగా అభివృద్ధి చెందింది.వీటితో పాటు సోషల్ మీడియా ప్రముఖ సోషల్ మీడియా వినియోగం కూడా బాగా పెరిగింది. వాట్సాప్ కొత్త సంవత్సరంలో కొన్ని మార్పులు తీసుకొచ్చేందుకు సిద్దమైంది. వీటిలో ప్రధానంగా డెస్క్ టాప్ గ్రూప్ ఆడియో, వీడియో కాలింగ్ తో పాటు కొన్ని అదనపు ఫీచర్లను అందుబాటులోకి తేనుంది. పాత పద్దతులను అలానే కొనసాగిస్తు నూతనంగా ఖాతాను రూపొందించునే వారికి ఈ నూతన పద్దతుల షరతులు వర్తించనున్నాయి. ఆ ఫీచర్లను ఒక సారి చూద్దాం.
ఈ నూతన అప్డేట్ వల్ల డెస్క్ టాప్ యూజర్లకు శుభవార్తే అని చెప్పవచ్చు. నూతన అప్డేట్లో యాప్ ని డెస్క్ టాప్ లో వాడుతున్న వారికి కాలింగ్, గ్రూప్ కాలింగ్, వీడియో కాల్ లాంటి సదుపాయాలు లేవు త్వరలోనే ఈ సౌకర్యం రానుంది. దీనివల్ల యాప్ మరింత అభివృద్ధి చెందనుంది. కొత్తగా ఆకౌంట్ నమోదు చేసుకునే వారికి ఈ అప్డేట్ ప్రైవసీ పాలసీని ఆగింకరించాల్సిందే. ఒక వేళా అది విఫలమైతే వాట్స్ యాప్ మీ ఖాతాను తొలగించే అవకాశం ఉంది. వాట్సాప్ యూజర్లు కూడా ఈ కొత్త గోప్యతా నియమాలను అంగీకరించకూడదనుకుంటే, వారు వారి ఖాతాను కూడా తొలగించుకోవచ్చని సంస్థ తెలిపింది.
ఐ ఫోన్ల కోసం వాట్ యాప్ బీటా వెర్షన్లో కొత్త సంవత్సరానికి తీసుకొచ్చే మార్పులలో ఫోటోలు మరియు వీడియోలను వాట్సాప్లో పేస్ట్ చేసే అవకాశాన్ని తెస్తుందని సమాచారం. ఈ ఫీచర్ యొక్క వినియోగాన్ని తెలుసుకోవడానికి వినియోగదారులు ఫోటోల యాప్ నుండి చాలా చిత్రాలను ఎంచుకోవచ్చు, యాప్ లో పేస్ట్ చేసుకోవచ్చు ఆతరువాత అవి మీ వాట్స్ యాప్ లో అందుబాటులో ఉంటాయి. అవి మీకు నచ్చిన వారికి పంపుకోవచ్చు.