NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్

Electric Bike Accident’s: హైఅలర్ట్..ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదాలలో నీళ్లు జల్లితే విధ్వంసమే..!!

Electric Bike Accident’s: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పేలుడు ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల నుండి వస్తున్న ఫిర్యాదుల పై ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీల విషయంలో పునరాలోచనలో పడింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి ఇంటిలోనే చార్జింగ్ పెడుతుంటే.. బ్యాటరీలు పేలిపోయి.. సదరు ఇళ్ళల్లో ఉండే మనుషులు అనేక గాయాలతో మరణిస్తూ మరికొంతమంది మంచానికి పరిమితం అవుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పేలుడు జరిగిన సమయంలో నీళ్లు జల్లి.. మంటలను అదుపులోకి తీసుకోవాలన్న మంటలు అదుపులోకి రావడం లేదని.. తాజాగా తమిళనాడులో జరిగిన ఎలక్ట్రిక్ బైక్ పేలుడు ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

High alert..don't use water In electric bike accidents

ఇటీవల తమిళనాడులో.. ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసి ఇంటిలో చార్జింగ్ పెట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బ్యాటరీలో మంటలు చెలరేగి పోయాయి. దీంతో ఇంటిలో ఉన్న సభ్యులు..చుట్టూ పక్కల స్థానికులు మంటలను ఆర్పాలని నీళ్ళు పోసారు. తొలుత మంటలు తగ్గినా… ఆ తర్వాత కొద్ది క్షణాలకు వాహనం పెద్ద శబ్దంతో పేలి పోయింది. దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు అంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సాధారణంగా నీళ్లు పోస్తే మంటలు అదుపులోకి వచ్చి తగ్గిపోవాలి. కానీ ఈ ఘటనలో రివర్స్ అయ్యింది. ఏకంగా వాహనమే పేలిపోవడంతో.. ఎలక్ట్రిక్ వాహనాలకి సంబంధించి మంటలు అదుపులోకి తీసుకోవడం ఎలా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. పరిస్థితి ఇలా ఉంటే ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చల్లా రేగితే అదుపులోకి తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు వాడకూడదని లేటెస్ట్ గా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలలో ఉండే బ్యాటరీ సెల్ లో హైడ్రోజన్ వాయువు, లిథియం హైడ్రాక్సైడ్ వంటి రసాయనాలు ఉంటాయి. అయితే హైడ్రోజన్ వాయువుకు మండే స్వభావం ఉండటంతో… ఎట్టి పరిస్థితుల్లో కూడా.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ మంటలు చెలరేగిన సమయంలో నీళ్లు ఉపయోగించకూడదని.. ఉపయోగిస్తే తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. అయితే ఈ మంటలను అదుపులోకి తీసుకోవడానికి ఏబిసి పౌడర్ మాత్రమే చల్లాలని..నిపుణులు సూచించారు. ఇదిలా ఉంటే రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల పేలుడు ఘటనలు పెరిగిపోతుండటంతో వినియోగదారులు సైతం.. ఎలక్ట్రిక్ వాహనాలు అంటే భయపడే పరిస్థితి ఇప్పుడు దేశంలో నెలకొంది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri