Oxygen Express Trains: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.. పలు ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతే కాకుండా.. ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతుంది దీంతో ఆక్సిజన్ అందకుండా చాలామంది కరోనా రోగులు మృతి చెందుతున్నారు ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, సిలిండర్లను దేశవ్యాప్తంగా రవాణా చేయడానికి కొద్దిరోజుల్లో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనున్నట్లుగా జాతీయ రవాణా శాఖ అధికారులు తెలిపారు..
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కు డిమాండ్ అధికంగా ఉంది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ వైజాగ్, జంషెడ్పూర్, రూర్కెలా, బొకరో లో లోడ్ చేయడానికి కాళీ ట్యాంకర్లను.. ముంబై సమీపంలోని కలం బోలి, బోయిసర్ రైల్వే స్టేషన్ నుంచి రైలు సోమవారం ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.. రైల్వే నెట్వర్క్ ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తరలించవచ్చా లేదా అని విషయం గతంలోని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే మంత్రిత్వ శాఖను ఆశ్రయించారని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థనల తర్వాత రైల్వే శాఖ మెడికల్ ఆక్సిజన్ రవాణా యొక్క సాంకేతిక పరిస్థితులను పరీక్షించిందని.. ఫ్లాట్ వ్యాగన్ లపై రోడ్ ట్యాంకర్లతో రోల్ ఆన్ రోల్ ఆఫ్ సేవ ద్వారా రవాణా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.. ఏప్రిల్ 19 మొదట ఖాళీ ట్యాంకర్లను నడుపుతామని.. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభిస్తామని తెలిపారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట ఈ రైళ్లను ముందుగా చేరుస్తామని తెలిపారు. ఈ రైలు వేగంగా గమ్యస్థానాలు చేరుకునేందుకు వీలుగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణించే మార్గంలో ఎటువంటి అవాంతరాలు ఎదురవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.