Telangana Congress: తెలంగాణ సీఎం ఎవరు అవుతారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసిందన్న వార్తలు వినబడుతున్నా.. సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తమ పేరును పరిశీలించాలని అధిష్టానానికి కోరుతుండటంతో సందిగ్దత కొనసాగుతోంది. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీఎల్పీ తీర్మానం, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న డీకే శివకుమార్ సహా పార్టీ పరిశీలకులు ఢిల్లీకి చేరుకుని పార్టీ హైకమాండ్ కు నివేదించారు.
ఈ విషయంపై ఖర్గే మంగళవారం ఉదయం ఓ క్లారిటీ ఇచ్చారు. ఇవేళ పార్లమెంట్ లోకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఛాంబర్ లో కాంగ్రెస్ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఖర్గే వెళుతూ మీడియాతో మాట్లాడారు. ఈ రోజే సీఎం అభ్యర్ధిని ఖరారు చేస్తామని, సాయంత్రం లోపు సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తామని ఖర్గే క్లారిటీ ఇచ్చారు. పార్టీ పరిశీలకుల నివేదికను పరిశీలించి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం సీఎం పేరును ప్రకటిస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసి.. సీఎం అభ్యర్ధి ఎంపిక విషయంలో తమ పేర్లు కూడా పరిశీలించాలని కోరనున్నట్లు తెలుస్తొంది. కాగా, పార్టీ అధిష్టానంతో చర్చల అనంతరం డీకే శివకుమార్, పార్టీ పరిశీలకులు ఇవేళ సాయంత్రం సీఎం అభ్యర్ధి పేరున్న సీల్డ్ కవర్ తో హైదరాబాద్ చేరుకుంటారని అంటున్నారు.
నిన్న (సోమవారమే) సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్ధిని ఎంపిక చేస్తారని, రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుందని అందరూ భావించారు. అయితే రేవంత్ రెడ్డికి సీఎం ఇచ్చేందుకు పలువురు సీనియర్ లు తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా వార్తలు వచ్చాయి, ఇదే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తనకు ఒక్కడికి మాత్రమే ఇవ్వాలనీ,వేరే ఎవరికి ఇచ్చినా ఒప్పుకునే ప్రసక్తిలేదని భట్టి విక్రమార్క అన్నట్లు తెలుస్తొంది. అయితే సీతక్కకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం.
ఇక స్పీకర్ పదవి తీసుకునేందుకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యతిరేకించినట్లు వార్తలు వినబడుతున్నాయి. పరిశీలకుల వద్ద జరిగిన సమావేశంలో పరుష పదజాలంతో పలువురు సీనియర్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న కారణంగానే .. సీఎం అభ్యర్ధి ఎంపికను వాయిదా వేసి పరిశీలకులు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. ఈ నెల 7వ తేదీనే సీఎం సహా నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని భావిస్తున్నారు.
Telangana Congress: దిశదిన గండం నూరేళ్ల ఆయుష్షే(నా)..! మాజీ మంత్రి కడియం సంచలన కామెంట్స్