కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ తో పార్టీలోని అంశాలు, రాహుల్ గాంధీ పర్యటన , పార్టీలో చేరికలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీలో తాను యాక్టివ్ గానే ఉన్నట్లు చెప్పారు. బిజీగా ఉండటం వల్లనే పీఏసీలకు వెల్లలేదన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసే పని చేస్తున్నానని చెప్పారు.
పార్టీలో యాక్టివ్ గా ఉన్న వారికే టికెట్లు ఇవ్వాలనీ, వచ్చే ఎన్నికల్లో 70 నుండి 80 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి తెలిపారు. ముందుగానే నూరు శాతం అభ్యర్ధులను ఖరారు చేయాలని, అన్ని సామాజిక వర్గాలకు టికెట్లు ఇవ్వాలని అన్నారు. రాహుల్ గాంధీ సిరిసిల్ల సభ పైనా చర్చించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని అందుకు సన్నద్దంపై చర్చించామన్నారు. ఒక్కరితో పార్టీ అధికారంలోకి రాదనీ సమిష్టి కృషి అవసరమని అన్నారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం తెలంగాణ అంతటా పర్యటిస్తానని పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
టీ కాంగ్రెస్ నేతల భేటీలో షర్మిల పార్టీపై చర్చ.. ఎందుకంటే..?