Breaking: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మూడో సారి అధికారంలోకి వస్తామన్న ధీమాతోనే సీఎం కేసిఆర్ .. సోమవారం కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ప్రగతి భవన్ కు కౌంటింగ్ కు ముందు రోజే రంగుల అలంకరణ ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం గట్టడంతో సీఎం కేసిఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
ముందుగా ఆయనే స్వయంగా రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ తమిళి సై ని కలిసి రాజీనామా లేఖ ఇస్తారని భావించారు. గవర్నర్ అపాయింట్మెంట్ కొరకు సీఎంఓ సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే సీఎం కేసిఆర్ దూత ద్వారా తన రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపారు. సీఎం కేసిఆర్ రాజీనామా లేఖను స్వీకరించిన గవర్నర్ ఆమోదించినట్లు తెలిసింది. కాగా, సీఎం కేసిఆర్ గజ్వేల్ నుండి గెలవగా, కామారెడ్డి నుండి ఓటమి పాలైయ్యారు. అక్కడ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడవ స్థానంలో నిలవగా, బీజేపీ అభ్యర్ధి గెలుపొందారు.
Breaking: తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ పై సస్పెన్షన్ వేటు