BRS: బీఆర్ఎస్ పార్టీ రానున్న లోక్ సభ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ సారి లోక్ సభ ఎన్నికలు ముందుగానే వస్తాయని వార్తలు వెలువడుతున్న నేపత్యంలో ఆ పార్టీ అప్రమత్తమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తొంది. అత్యధిక లోక్ సభ స్థానాలు సాధించి జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకం కావాలని ఆకాంక్షిస్తొంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
తెలంగాణ భవన్ లో సోమవారం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనేతలతో కేటిఆర్ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత లోక్ సభ సభ్యుడు రంజిత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, పలువురు మాజీ ఎమ్మెల్యేలు హజరైయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించారు.
గెలుపు కోసం అందరూ సమిష్టి అందరూ కృషి చేయాలని కేటిఆర్ సూచించారు కేటిఆర్. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జనవరి 26వ తేదీలోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆర్ఎస్ అభ్యర్ధులే నియోజకవర్గ ఇన్ చార్జిలని, వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని కేటిఆర్ స్పష్టం చేశారు.
సమీక్ష అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తననే మళ్లీ చేవెళ్ల అభ్యర్ధిగా పోటీ చేయమని కేటిఆర్ చెప్పారన్నారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా 9వేల మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏమీ చేయలేదని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తొందన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చిందని అన్నారు. ఆ హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని అన్నారు రంజిత్ రెడ్డి.
KA Paul Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేఏ పాల్ భేటీ .. కారణం ఏమిటంటే..?