KA Paul Revanth Reddy: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు హస్యాన్ని అందిస్తూ కామెడీ కింగ్ గా పేరుతెచ్చుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేఏ పాల్ తో భేటీ అయ్యారు. మీడియా ముందు పొంతన లేని మాటలతో హస్యాన్ని పండిస్తున్నా రాజకీయ పార్టీల ప్రముఖులు ఆయనకు అపాయింట్మెంట్ లు ఇస్తూనే ఉంటారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో ఇవేళ కేఏ పాల్ మర్యాదపూర్వకంగా కలిశారు.
జనవరి 30వ తేదీ హైదరాబాద్ లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హజరు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ను ఆయన అహ్వానించారు. అలాగే సదస్సుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని కేఏ పాల్ తెలిపారు. ప్రపంచ శాంతి సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లుగా వివరించారు కేఏ పాల్. పలు దేశాల నుండి వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హజరు కానున్నట్లు కేఏ పాల్ తెలిపారు.
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధులకు, ఆయనకు ఓట్లు రాకపోయినా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ భారీ హామీలను ప్రజలకు గుప్పిస్తుంటారు కేఏ పాల్.
CM YS Jagan: కడప జిల్లాలో ముగిసిన సీఎం వైఎస్ జగన్ పర్యటన
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!