CM KCR TamiliSai: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వేదిక పంచుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ పలకరించుకున్నారు. గత కొద్ది నెలలుగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసిఆర్ మధ్య గ్యాప్ పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసిఆర్, ప్రభుత్వ అధికారుల వైఖరిపై ల గవర్నర్ తమిళిసై బాహాటంగానే విమర్శలు చేశారు. ఈ విషయంలో గవర్నర్ ను నేరుగా కేసిఆర్ విమర్శించకపోయినా పలువురు మంత్రులు గవర్నర్ వైఖరిని విమర్శించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమాలకు సీఎం కేసిఆర్ తో సహా మంత్రులు దూరంగా ఉంటున్నారు. ఇటీవల రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్ కూడా నిర్వహించారు. తనను ఎవరూ ఆపలేరంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా ఇద్దరి మధ్య గ్యాప్ తారా స్థాయికి చేరుకున్న తరుణంలో మంగళవారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్, సీఎం పరస్పరం పుష్పగుచ్చాలతో గౌరవించుకోవడాన్ని అందరూ ఆశ్చర్యంగా తిలకించారు.
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ తో మంగళవారం రాజ్ భవన్ తో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసిఆర్ హజరైయ్యారు. సీజే ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత తేనీటి విందులో తమిళిసై కేసిఆర్, ఉజ్జల్ భుయాన్ పాల్గొన్నారు. గవర్నర్, సీఎం మధ్య సమావేశం సాఫీగా సాగిందనీ, సుహృద్భావ వాతావరణంలో జరిగిందని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
అయితే ఈ కార్యక్రమాల్లోని ఒక ఫోటోలో సీజే, గవర్నర్ లు ఎదురెదురుగా కాస్తంత దగ్గరగా, వారిద్దరికి మధ్యలోనే అల్లంత దూరంగా కేసిఆర్ కూర్చున్నట్లుగా ఉండటంతో, ఆ ఫోటోపై తీన్మార్ మల్లన్న వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. “తమిళిసై, కేసిఆర్ మధ్య గ్యాప్ ఉందని తెలుసు కని మరీ ఇంత అని తెలియదు” అంటూ ఈ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు,
గ్యాప్ ఉందని తెలుసు కని మరీ ఇంత అని తెలియదు #GoldenEagleTelangana pic.twitter.com/tnFQf4QUWO
— Teenmar Mallanna (@TeenmarMallanna) June 28, 2022